కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త శాంతియుత ఆందోళనలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సిట్( SIT ) విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పినా కూడా సిట్ అధికారులు నందినగర్లో గోడకు నోటిసులు అంటించడం దారుణమని అన్నారు. ఇది కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.

