ఆమె పెళ్లి రోజు చివరకు జీవితంలో చీకటి రోజుగా మారింది. ఢాకా అల్లర్లకు బాధ్యురాలిగా ఆమెకు అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) కోర్టు సోమవారం నవంబర్ 17న మరణ శిక్ష విధించింది. సరిగ్గా 58 ఏళ్ల క్రితం ఇదే రోజు హసీనా వివాహం జరిగింది. 1,400 మంది మృతికి కారణమయ్యారని మాజీ ప్రధానికి పెళ్లిరోజు ఉరి ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఆమె పశ్చాత్తాపం పడాలనే ఉద్దేశంతోనే తీర్పు తేదీని నవంబర్ 14 నుంచి 17కు మార్చారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

