ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేశారు. బీహార్లో మోదీ, నీతీశ్ నాయకత్వంలా.. ఏపీలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయకత్వం ఉందని నారా లోకేష్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ.. ఓవైపు ఆయన ఓట్ చోరీ అని ఆరోపణలు చేస్తునే.. మరోవైపు, ఓటర్ లిస్టులో అవకతవకలను సరి చేయడానికి చేపట్టిన ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయన ఒకే వాదనకు కట్టుబడి ఉండాలని.. ఒకేసారి రెండు వాదనలు చేయడం సాధ్యం కాదని హితవు పలికారు.

