మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తనయుడు పార్థ పవార్కు చెందిన సంస్థకు రూ.1800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.300 కోట్లకే కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో భూ కుంభకోణం లో రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకే దక్కించుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది.దీనిపై అజిత్ పవార్ స్పందిస్తూ అది ప్రభుత్వానికి చెందిన భూమి అని తన కుమారుడికి తెలియదని చెప్పారు. ఆ భూ కేటాయింపులను రద్దు చేసినట్లు ప్రకటించారు.

