తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వాడుకోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది ఇందిరా గాంధీనే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

