ప్రకృతి విపత్తులతో ఫిలిప్పీన్స్ అల్లాడిపోతోంది. గతనెల వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి కోలుకోక ముందే కల్మేగీ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు ఫిలిప్పీన్స్ను
అతలాకుతలం చేస్తున్నాయి. ఈ తుఫానుకు సెబు ప్రావిన్స్ అత్యంత ప్రభావితమైంది. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు ఇప్పటి వరకూ దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ వరదల్లో 26 మంది గల్లంతయ్యారు.

