
పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో రష్యాలోని పాకిస్థాన్ రాయబారి బహిరంగ బెదిరింపులకు దిగారు. ఒక వేళ పాక్పై కనుక న్యూఢిల్లీ దాడికి దిగితే అణ్వాయుధాలు సహా పూర్తి స్థాయి శక్తులను వినియోగించిఇస్లామాబాద్ ప్రతిఘటనకు దిగుతుందని మహమ్మద్ ఖలీద్ జమాలి హెచ్చరించారు. రష్యాకు చెందిన ఆర్టీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్లోని కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని భారత్ నిర్ణయించినట్టు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్న పాకిస్థాన్ ఆర్మీ అన్నింటికీ సన్నద్ధమై ఉందని ఆయన చెప్పారు.