
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు స్మిత సబర్వాల్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేసినట్లు చెప్పారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని స్మితా సబర్వాల్ స్మిత ఎక్స్ వేదికగా స్పందించారు.