దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్లు జోరందుకున్నాయి. బెట్టింగ్ రాయుళ్ళు భారీగా పందాలు కాస్తున్నారు. కొందరు తమ అభిమాన పార్టీల మీద పందాలు కాస్తుంటే మరికొందరు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆధారంగా చేసుకుని బెట్టింగ్ కు సిద్ధమయ్యారు. వాట్సాప్ , టెలిగ్రామ్ వంటి వాటిలో గ్రూపులు క్రియేట్ చేసి పందాలు నిర్వహిస్తున్నారు. మిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని పందాలు జోరుగా సాగుతున్నాయి. విజయ్ పార్టీపై ఒకటికి మూడు రెట్లు మొత్తం ఆఫర్ చేస్తున్నారు.

