దారుణం.. జర్నలిస్టుతో కాళ్లు పట్టించుకున్న కాలేజీ యాజమాన్యం
ఏపీలో జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన విషయం మరువకముందే తాజాగా అనంతపురంలో గీతం జూనియర్ కళాశాల అక్రమాలను వెలుగులోకి తెచ్చారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై ఆ సంస్థ యాజమాన్యం పైశాచికంగా ప్రవర్తించింది. ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా కన్న కొడుకు కళ్లముందే బలవంతంగా తమ కాళ్లు మొక్కించుకున్నారు. అక్కడితో ఆగకుండా క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు. ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ […]

