సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు పరిశీలించారు. తాజాగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని 3.32 కి.మీ.ల పొడవుతో రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన చంచల్గూడ జైలు నుంచి సంతోష్ నగర్లోని యాదగిరి థియేటర్ వరకు ఉంది.