‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆందోళనల సెంట్రల్ ఢిల్లీలోని 16 స్టేషన్లలో సేవలను నిలిపివేశారు. అంశం గురువారం సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో సీజేఐ స్పందిస్తూ, మధ్యాహ్న భోజన విరామ సమయానికి సమస్య పరిష్కారం కాకపోతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు.

