నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీ కోసం జంతర్ మంతర్ కేంద్రంగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. దాంతో, భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 23, గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ నుంచి ఒటిన్నర (1.5 కి.మీ) కిలోమీటర్ల వరకూ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అర్ధ రాత్రి 12 గంటల వరకు ఆ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.