మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లా ఆసుపత్రిలో విషం సేవించిన ఓ యువకుడికి సాధారణ సెలైన్కు బదులుగా రెండు లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ నుంచి డ్రిప్ ఇస్తున్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఈ ఆరోపణలను దిండోరి చీఫ్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ పాండే ఖండించారు.రోగికి మినరల్ వాటర్ను డ్రిప్ రూపంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎలుకల విషం సేవించిన తర్వాత గ్యాస్ట్రిక్ లావేజ్ (కడుపును శుభ్రపరిచే ప్రక్రియ) నిర్వహించామని, ఆ ప్రక్రియలో ఉపయోగించిన బాటిల్ మాత్రమే వీడియోలో కనిపించిందని వివరించారు.