పార్లమెంట్లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి కీలక వ్యూహ సమావేశం నిర్వహించింది. ఇప్పటివరకు NDA Parliamentary Party Meetingగా పిలిచిన ఈ వారపు సమావేశానికి ‘మంగళ్ మిలన్’ అనే కొత్త పేరు పెట్టారు. సమావేశంలో NDA ఎంపీలు ప్రధానమంత్రి మోదీతో కలిసి త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. NDA బహుపక్ష కూటమి కావడంతో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశం కీలకంగా పనిచేస్తుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఆర్డినెన్సులు, వాటిపై చర్చలు, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తారు.