మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న దర్గా ఆవరణలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారంనాడు అనుమతించింది. వివాదాస్పద ప్రాంతానికి పక్కన ముస్లింలకు కొంత స్థలాన్ని ప్రార్థనల కోసం కేటాయించాలని, ఆ స్థలంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్శాల ఆలయ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురావస్తు శాఖలు ఆదేశాలు జారీ చేసింది.