భారతదేశం ‘వన్ నేషన్, వన్ టైమ్’ దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా చట్టపరమైన, పరిపాలనా, వాణిజ్య మరియు ఇతర అన్ని అధికారిక ప్రయోజనాల కోసం ఇకపై Indian Standard Time – IST ను వినియోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం వివిధ సంస్థలు వేర్వేరు Time sources ఉపయోగిస్తుండటం వల్ల ఆయా కార్యకలాపాల సమన్వయంలో, లావాదేవీల రికార్డింగ్లో అసమానతలు, లోపాలు తలెత్తుతున్నాయని, ఇలాంటి సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టి, కచ్చితంగా అమలు చేయడానికే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నారు.