వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలతో పొత్తుకు ఎంఐఎం సిద్ధమని, ఏ పొత్తులోనైనా తమకు గౌరవం, సమాన హోదా కావాలని డిమాండ్ చేశారు. పూర్తి బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒవైసీ ప్రకటించారు.