ఇండోనేషియాకు అస్త్ర క్షిపణులు సరఫరా చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. అలాగే పలు గల్ఫ్ దేశాలు కూడా భారత్ క్షిపణుల్ని, ఇతర రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగానికి కూడా ఇందులో అవకాశం కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే అస్త్ర 2 మార్క్ క్షిపణుల తయారీకి ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానించబోతున్నారు. ఇందులో ఐకామ్, అదానీ, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ వంటి సంస్థలు పోటీలో ఉండే అవకాశం ఉంది.