తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిశారు. ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి అధికారిక పర్యటన నిమిత్తం ఆయన బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఢిల్లీలోని తమిళనాడు హౌస్ను సందర్శించారు. అక్కడ ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.