అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్లో 2026-2030 మధ్య కాలంలో మొత్తం 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాను విస్తరించడానికి 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. 2030 నాటికి 3.8 మిలియన్ల ఉద్యోగాలు, 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.