మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేసి, నలుగురు ప్రాణాలను బలిగొన్న ఆడపులి ప్రత్యేక ట్రాకింగ్ బృందాలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లను రంగంలోకి దించారు. శిరజ్గావ్ కస్బా సమీపంలో పులి కదలికలను గుర్తించిన ప్రత్యేక ఆపరేషన్ బృందం ఎంతో చాకచక్యంగా ట్రాంక్విలైజర్ గన్ ద్వారా మత్తుమందు ప్రయోగించి దానిని బంధించింది. అటవీశాఖ అధికారులు మత్తుమందు (ట్రాంక్విలైజర్) ప్రయోగించి బంధించిన కొద్దిసేపట్లోనే ఆ పులి తుదిశ్వాస విడిచింది.