విజయవాడలో నకిలీ, మ్యూల్ (అద్దె) బ్యాంక్ ఖాతాల ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన ఉదంతాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకులను ఏకంగా ₹5.28 కోట్ల మేర మోసం చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. మోసం చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను, భారీగా నగదును, కీలక పత్రాలను జప్తు (సీజ్) చేశారు.