తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘తెలంగాణ ఎడ్సెట్-2026’ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మే 12న జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలు వెల్లడించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,342 మంది హాజరయ్యారు.