తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు.