అమెరికా అధ్యక్షడు ట్రంప్పై హత్యాయత్నం కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు 5 నుంచి 8రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఈ ఘటనలో ట్రంప్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వెంట్లో పాల్గొన్న వందాలది మంది టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలను కాపాడుకున్నారు

