ఎపి హైకోర్టు తొలి మహిళా సిజెగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.
జస్టిస్ లీసా గిల్కు న్యాయవ్య వస్థలో 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. జస్టిస్ లీసా గిల్ నవంబర్ 17, 1966 న చండీగఢ్లో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ-ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.

