తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ ఆ పార్టీని వీడారు. పార్టీకి చెందిన అన్ని పోస్టులకు ఆమె రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్కు లేఖ రాశారు. గత వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. 53 ఏళ్ల సుష్మితా దేవ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆమె 2021లో తృణమూల్ పార్టీలో చేరారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నట్లు ఆమె చెప్పారు.

