ఐక్యరాజ్యసమితిలో నూతనంగా రూపొందించిన ప్రపంచ పటానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఇదే సమయంలో ఇండియా అధికారికంగా ప్రకటించిన పటంలో ఉన్నట్లుగానే జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు ఇండియాలోనే ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితిని హెచ్చరించింది. నూతన ప్రపంచ పటంలో ఈ ప్రాంతాలను తప్పుగా చూపించినా, సరిగ్గా లేకున్నా సహించబోమని ఐరాసకు వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రపంచ పటం ఒక దేశ జాతీయ సరిహద్దుల్ని నిర్ణయించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటించారు.