అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డి నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు, నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు ఇప్పటివరకు 20 ప్రాంతాల్లో స్థిర, చరాస్తులను గుర్తించినట్లు సమాచారం. గచ్చిబౌలిలో జీ+2 నివాస భవనం, ల్యాంకో హిల్స్లో500 గజాల కమర్షియల్ ఆస్తి, జహీరాబాద్లో మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, కర్నాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, దనంగా ఒక మైనింగ్ కంపెనీలో రూ.75 లక్షల పెట్టుబడి భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.