ఏపీ కేబినెట్ భేటీకి కొందరు ఐఏఎస్ అధికారులు ఆలస్యంగా రావడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఉన్నా సమయపాలన పాటించకపోవడంపై మండిపడుతూ.. లేటుగా వచ్చిన వారి పేర్లను నోట్ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, క్రమశిక్షణ తప్పనిసరని అధికారులను గట్టిగా హెచ్చరించారు.