ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లోనూ లిక్కర్ విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఎయిర్పోర్టులలో వైన్ షాపులు, బార్ల ఏర్పాటుకు అనుమతితో పాటుగా లైసెన్స్ ఫీజు, దరఖాస్తు రుసుములను వెల్లడిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాశ్రయాలలో 24 గంటలు బార్లు, వైన్స్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి (రేణిగుంట) మినహాయింపు ఇచ్చారు.