ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గాయపడ్డారు. సోమవారం సాయంత్రం భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన కార్యాలయం తెలిపింది. డా.జె. మధుసూదన్రావు, డా.ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని బృందం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునేందుకు 6-8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొంది.