మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు గురువారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న ఆయన మనవడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి భావోద్వేగంతో అంజలి ఘటించారు. తారక్ రాకను గమనించిన అభిమానులు, నందమూరి కేడర్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ‘జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.