
క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించామని.. నిధుల విడుదల తప్ప ఇతర విషయాల్లో ఆర్థిక శాఖ ప్రమేయం లేదని కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి,మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు చేయాలని టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ సిఫారసు మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటల తెలిపారు.