ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరదించుతూ.. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించిందని ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం రోజు కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇరాన్లోని అణు స్థావరాలపై దాడి చేయడంతో ప్రారంభమైన 12 రోజుల తీవ్రమైన వైమానిక దాడులు, ప్రతిదాడుల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడటం అంతర్జాతీయ సమాజంలో ఒక పెద్ద పరిణామంగా భావిస్తున్నారు

