సీజేపీ కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విధులు నిర్వహించింది. అయితే ఓ ఆర్ఏఎఫ్ ఆఫీసర్ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్టు వివాదాస్పదం అయ్యింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ చనిపోయిన బొద్దింక ఫోటోను పోస్టు చేసింది. బొద్దింకలు వాటికి అవే ఏమీ చేయలేవు.. దేశాన్ని మారుస్తాయా అన్న కామెంట్ చేశారామె. దీంతో ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

