పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో హుటాహుటిన షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ భద్రత నడుమ, ఎవరికీ కనిపించకుండా ఇమ్రాన్ను జైలు అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై పీటీఐ మద్దతు దారులు, సాధారణ ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆసుపత్రికి వెళ్లేలా అనుమతించాలని మే నెల నుంచి ఇస్లామాబాద్ హై కోర్టును ఇమ్రాన్ ఖాన్ వేడుకుంటున్నా..ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది.