స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి దాదాపు గంటసేపు ప్రసంగిస్తుండగా మంత్రి బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. తలతిరిగి పడిపోతుండగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మరియు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.