నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు నేతృత్వం వహించన కాక్రోచ్ జనతా పార్టీ ( CJP ) భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. ఆగస్టు 5న సీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. మహారాష్ట్రలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో జరిగే ఈ భేటీకి.. వాలంటీర్లు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి రావాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశంతో పాటు విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.