తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. నడకమార్గంలో చిరుత సంచరించిన ఘటనపై టీటీడీ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా స్పందించారు. శుక్రవారం రాత్రి నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిరుతను చూసి.. భక్తులు కేకలు వేస్తూ పరుగులు తీశారు.రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు భక్తులు ఒంటరిగా వెళ్లకుండా, గుంపులుగా ముందుకు సాగాలని సూచించారు.