ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న తన 76వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ధర్మపత్ని నారా భువనేశ్వరి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం ఆమె రూ. 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. చంద్రబాబు వయసు 76 ఏళ్లు కావడంతో, దానికి తగ్గట్టుగా అదే సంఖ్యలో విరాళం ఇవ్వడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

