తనపై దుష్ప్రచారం చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు. టీడీపీ నాయకుల మెప్పు కోసం తప్పుడు ఫిర్యాదు ఇస్తున్నారని మండిపడ్డారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూపల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు కు వినతి పత్రం అందజేశారు.

