ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేశ్ చందల్కు ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ మంజూరీ చేసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో అతనికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ను ఈడీ అడ్డుకోలేదని అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సాల్ తెలిపారు. ఈ కేసులో ఈడీ స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసుకున్నది. దర్యాప్తులో వినేశ్ సహకరించినట్లు ఈడీ చెప్పింది. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లేందుకు షరతు విధించారు

