బడ్జెట్పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది విజన్, మిషన్, దిశానిర్దేశంలేని బడ్జెట్ అని, పూర్తిగా అబద్ధాలతో నిండి ఉందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు బయలుదేరేముందు కోల్కతా
విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం దేశ ఆర్థికవ్యవస్థను సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. ఈ బడ్జెట్కు ఎలాంటి లక్ష్యం లేదన్నారు. ఇది పూర్తిగా పేదలు, మహిళలు, రైతులు, యువత, సామాన్యులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనదని మమత మండిపడ్డారు.

