పేద కుటుంబాల్లో పుట్టిన మెరికల్లాంటి పిల్లలకు, కార్పోరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ నిలిపేయాలని చూస్తుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పించడం ఇష్టం లేదా? కేవలం 150 కోట్ల బకాయిలు చెల్లించే స్థోమత లేదా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.

