తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కనీవినీ ఎరగని రేంజ్ లో రికార్డు సృష్టించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సాయంత్రం 5 గంటల వరకు 82.24 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 1952 నుంచి ఇదే అత్యధిక శాతం ఓటింగ్ కావడం విశేషం. 2011 ఎన్నికల్లో 78.29 శాతం పోలింగ్ నమోదైంది. రాజధాని చెన్నైలో 81.34శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

