మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పీసీసీ చీఫ్ తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. పార్టీ నిబంధనలను పాటించకపోతే ఆయనపై వేటు తప్పదని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ, విభేదాలను సరిదిద్దుతూ, అందరూ కలిసి పనిచేసేలా చూసే బాధ్యత తనదేనని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, దానిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని ఆయన పేర్కొన్నారు.

