ధార్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 35 మందితో వెళ్తున్న ఒక పికప్ వ్యాన్, తిర్లా చికాలియా క్రాసింగ్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో వాహనం వీరిని ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

