ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 తేదీల మధ్య వీటిని నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికి మే 1 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు

